నాలుగో స్వర్గం ఒకరోజు రామలింగడు చాలా మంది కవులతో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఒక సన్యాసి అక్కడికి వచ్చాడు. సన్యాసి వాళ్ళందరి ముందు గొప్పలు చెప్పుకోవడం మొదలు పెట్టాడు. "ఈ భూలోకం ఎక్కడ చూసినా పాపాలతో నిండిపోయింది. ఇది భరించలేక నేను ప్రతిరాత్రి స్వర్గానికి పోతాను.అక్కడ ఉండి వస్తుంటాను" అని బడాయిలు కొట్టాడు. రామలింగడు సన్యాసి బడాయికోరు తనం గమనించాడు. అతినికి బుద్ధి చెప్పాలని అనుకున్నాడు. "అయ్యా! మీరు నాలుగో స్వర్గ్గానికి ఎప్పుడైనా వెళ్ళారా?" అని సన్యాసిని అడిగాడు. నిజంగానే నాలుగో స్వర్గ్గం ఉందను కొన్నాడు సన్యాసి. దాన్ని చూడలేదంటే అందరూ నవ్వుతారనుకొన్నాడు. "దానిదేమొంది? రాత్రి కూడా నేను నాలుగో స్వర్గ్గానికి వెళ్ళి వచ్చాను" అని అబద్దమాడేశాడు. "అక్కడ ఆకాశగంగలో మీరు మునిగారా?" అనడిగాదు రామలింగడు. "అంతదూరం వెళ్ళి మునగకుండా వస్తానా? రాత్రి కూడా మునిగే వచ్చాను" అన్నాడు సన్యాసి గొప్పగా. "ఆ ఏటి గట్టున ఇసుక మీద మీకు మెత్తగా ఏమైనా తగిలిందా?" అని మళ్ళీ అడిగాదు రామలింగడు. "తగలకేం? బాగా నూరిన గంధం లాంటిది మెత్తగా తగిలింది. అది ఎంత మంచి వాసన!" అని ఇంకా బడాయి కొట్టాడు సన్యాసి. "అది నా గుర్రం వేసిన పేడలెండి. రాత్రి నేను కూడా నాలుగో స్వర్గ్గం వచ్చాను గదా?" అన్నాడు రమలింగడు. దీంతో అంతా ఫక్కుమని నవ్వారు. సన్యాసి మొగం చిన్నబోయింది. తల వంచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. లెంపకాయ ఖరీదు ఒకరోజు రామలింగడు వీధిలో వెలుతున్నాడు. ఎవరో వెనక నుంచి వచ్చి ఒక్క గుద్దు గుద్దేడు. ఆ దెబ్బకి రామలింగడికి ప్రాణం పోయినంత పనయింది. కింద పడిపోయాడు. ఆ పక్కనే వెళుతున్న వాళ్లు కొట్టిన వాడిని పట్టుకున్నాడు. రామలింగడిని లేవ దీశారు. తనని కొట్టిన వాడిని రామలింగడు ఎప్పుడూ చూడలేదు. "ఎందుకయ్యా ఆయన్ని కొట్టేవు" అని అంతా అతన్ని నిలదీశారు.అతను కంగారు పడ్దాడు. "అబ్బే. తమరనుకోలేదండీ. నా సావాసగాడు వెనక నుంచి చూస్తే మీలాగే ఉంటాడు. వాడనుకుని తమాషాగా కొట్టేను" అన్నాడు. సావాసగాడయితే మాత్రం తమాషాకి అంత దెబ్బ కొడతాడా? అని ఎవ్వరూ ఒప్పుకోలేదు. ఆ మనిషిని మంత్రిగారి దగ్గరికి తీసుకుపోయేరు. మంత్రి అంతా విచారించాదు. ఆ దెబ్బ కొట్టిన వాడు మంత్రికి దగ్గర చుట్టం అవుతాడు. అంచేత ఆయన వాడిని ఎలా అయినా వదలిపెట్టాలనుకొన్నాడు. "పోనీవయ్యా రామలింగా! తెలియక పొరపాటు చేశాడు. ఏమనుకోవద్దంటున్నాడుగా ఊరుకో" అన్నాడు. రామలింగడు ఒప్పుకోలేదు. "సరే! ఒక రూపాయి జరిమానా వేస్తాను" అన్నాడు మంత్రి. కొట్తినవాడు తన దగ్గర రూపాయి లేదన్నాడు. మంత్రి వాడిని చూసి నవ్వాడు. ఇంటికి పోయి రూపాయి తీసుకు రమ్మన్నడు. వాడు దొరికిందే సందని పారిపోయాడు. రామలింగడికి ఇదంతా చూసి వళ్ళు మండి పోయింది. మంత్రి దగ్గరగా వెళ్లాడు. "అయితే మంత్రిగారూ! నాకు తెలియక అడుగుతాను. దెబ్బ, గుద్దు, లెంపకాయ వీటి ఖరీదు ఒక రూపాయి అన్నమాట. బాగుందే" అన్నాడు. "అంతేగామరి" అన్నడు మంత్రి. " ఓహో! అలాగా" అన్నాడు రామలింగడు. వెంటనే సాగదీసి మంత్రిగారిని ఒక్క లెంపకాయ కొట్టేడు. మంత్రి మొర్రో అన్నాడు. " మంత్రిగారూ! నాకు అవతల బోలెడు పని ఉంది. నేను పోవాలి. ఈ దెబ్బకు రూపాయి సరిపోతుంది గదా! నన్ను కొట్టినవాడు రూపాయి తెస్తాడుగా. అది తమరు పుచ్చుకొండి" అని చెప్పి రామలింగడు విసవిసా వెళ్లిపోయాడు. సంచిలో ఏనుగు ఒకరోజు రామలింగడు సభకి చాల ఆలస్యంగా వచ్చాడు. రాజుగారు రామలింగడిని పిలిచారు. ఆలస్యంగా ఎందుకు వచ్చావని అడిగారు. "రాజా! మా చిన్న కొడుకు ఈవేళ చాలా గొడవ చేశాడు. వాడిని సముదాయించి వచ్చే సరికి ఇంతసేపై<ది" అన్నాడు రామలింగడు. దానికి రాజు ఫక్కున నవ్వాడు. "రామలింగా! ఏదో సాకు చెప్పావుగానీ, పిల్లల్ని సముదాయించడం అంత కష్టమా?" అన్నాడు. "లేదు మహారాజా! చిన్న పిల్లలకి నచ్చిజెప్పడం చిన్న పనికాదు. అంతకంటే కష్టమైన పని ఇంకోటి లేదు. అది కావాలి. ఇది కావాలని ఏడిపిస్తారు. ఇవ్వకపోతే ఏడుపు లంకించుకుంటారు.కొట్టినా, తిట్టినా శోకాలు పెడతారు. ఇవన్నీ వేగడం ఊరుకోబెట్టడం చెప్పలేంత కష్టం!" అన్నాడు రామలింగడు. రాజు దీనికి ఏ మాత్రం ఒప్పుకోలేదు. పైగా రామలింగడు కోతలు కోస్త్తున్నాడని అనుమానించాడు. "సరే రాజా! కొంతసేపు నేను చిన్న పిల్లవాడి గానూ, మీరు తండ్రిగానూ, ఉందాం, పిల్ల చేష్ట్టలెలా ఉంటాయో మీకు చూపిస్తాను" అన్నాడు రామలింగడు. సరేనన్నాడు రాజు. రామలింగడు మారాం మొదలు పెట్టాడు. మిఠాయి కావాలన్నాడు. "ఓస్ ఇంతే గదా!" అని రాజు మిఠాయి తెప్పించాడు. కొంచెం తిన్నాక బజారు పోదామని గోల చేశాడు రామలింగడు.రాజు అతన్ని తీసుకొని బజారుకి వెళ్ళాడు. వీధిలో అటూ ఇటూ పరుగెత్తుతున్నాడు రామలింగడు. తన వెంటే రాజుని పరుగెత్తించాడు. ఒక కొట్టుముందు ఆగాడు రామలింగడు. రంగు రంగుల సంచీ చూపించాడు. అది కొనమన్నాడు. సరేనని రాజు ఆ సంచీ కొన్నాడు. మరికొంత దూరం పోయారు. ఒక ఏనుగు కనబడింది. ఆ ఏనుగు కావాలని సతాయించాడు రామలింగడు. చేసేది లేక ఆ ఏనుగుని కూడా కొన్నాడు రాజు. అంతే! ఆ ఏనుగుని ఈ సంచీలో పెట్టమన్నాడు రామలింగడు. "సంచీలో ఏనుగెలా పడుతుంది? మరొకటి ఏమైనా అడుగు" అన్నాడు రాజు. "వీల్లేదు.ఏనుగునే సంచీలో పెట్టాలి. నాకింకేమీ వద్దు" అని వేధించుకు తిన్నాడు రామలింగడు. కొంతసేపటికి రాజు విసిగిపోయాడు. ఓడిపోయానని వప్పుకున్నాడు. రామలింగడు నవ్వుకున్నాడు. అమ్మగారి ఆఖరి కోరిక రాజుగారి తల్లికి మామిడి పళ్ళంటే చాలా ఇష్టం. ఆమెకి వానాకాలంలో బాగా జబ్బు చేసింది.చావబోయే ముందు మామిడి పండు తినాలని ఆవిడ కోరిక. రాజు భటులని దేశామంతా తిప్పాడు. ఎక్కడా ఒక్క మామిడి పండు కూడా దొరకలేదు. దాన్నే కలవరిస్తూ ఆమె ప్రాణాలు వదిలింది. చనిపోయేముందు తల్లికి మామిడిపండు తిని పించలేక పోయానే అని రాజు బాధ పడ్దాడు. ఈ సంగతి తాతాచారికి తెలిసింది. ఈ వంకతో వీలైనంత డబ్బు గుంజుకోవాలని ఎత్తువేశాడు. వెంటనే రాజు దగ్గరికి పోయాడు. "మహారాజా! బాధపడకండి! బంగారు మామిడి పళ్ళు చేయించి బ్రామ్మలకు దానం ఇవ్వండి. ఏటా ఆమె తద్దినంనాడు ఈ పని చేయండి. స్వర్గంలో మీ తల్లిగారికి శాంతి కలుగుతుంది" అని చెప్పాడు. రాజు ఏటా బంగారు మామిడి పళ్ళు దానం చేయడం మొదలెట్టాడు. లక్షల మంది బ్రామ్మలు దానం తీసుకు పోతిన్నారు. రెండేళ్ళకే రాజుగారి ఖజానా ఖాళీ అయిపోవచ్చింది. తాతాచారి మోసంతో రాజుగారు చిక్కుల్లో పడ్డాడు. ఏదో ఎత్తువేయాలి అని రామలింగడు ఆలోచించాడు. తర్వాత ఏడు కూడా లక్షల మంది బ్రామ్మలు దానం పుచ్చుకోవడానికి వచ్చారు. ముందు రోజే పట్నంలో దిగారు. రామలింగడు ఆ రాత్రి అందరినీ కలుసుకున్నాడు. ఈ ఏడు ఎన్ని కావాలంటే అన్ని మామిడి పళ్ళు ఇస్తారు. అయితే ఎన్ని పళ్ళు కావాలంటే అన్ని వాతలు వేయించుకోవాలి" అని అందరికీ చెప్పాడు. బ్రామ్మలంతా ఆశపడ్డారు. మర్నాడు పొద్దుటే రామలింగడు కొలువు బయట కొలిమి పెట్టించాడు. బ్రామ్మలకు వాతలు వేయించసాగాడు. కొందరు పది వాతలు కూడా వేయించుకున్నారు. కొలువు లోపలికి వెళ్ళి రాజుకు వాతలు చూపించారు. బంగారు మామిడి పళ్ళు ఇమ్మని అడిగారు. రాజు తెల్లబోయాడు. రామలింగడే ఈ వాతలు వేయిస్త్తునాడని తెలిసింది. విపరీతమైన కోపం వచ్చింది.రామలింగడిని పిలిచి ఇలా ఎందుకు చేస్త్తున్నావ్ అని అడిగాడు. "మహారాజా! మా అమ్మ వాత రోగంతో చనిపోయింది. పోయేముందు వాతలు వేయించమని అడిగింది. నేను వేయించే లోపలే కన్నుమూసింది. మరి ఆమె అత్మ కూడా శాంతించాలి గదా! అందుకు బ్రామ్మలకు వాతలు వెయ్యమని చెప్పారు. ఇంతమంది బ్రామ్మలు నాకు ఎప్పుడు దొరికుతారు? పైగా వాతలు వేయింస్తానంటే ఎవరు వస్తారు? అందుకే పనిలో పనిగా ఇప్పుడే వేయిస్త్తున్నాను" అన్నాడు. రాజుకి వెంటనే సంగతి అర్థమయింది. తాతాచారి మోసం తెలిసిపోయింది. తన తెలివి తక్కువ తనానికి సిగ్గుపడ్డాడు. ఆశపోతులు కాకపోతే ఒక్కొక్కరు అన్ని వాతలు వేయించుకుంటారా అనుకున్నాడు. వెంటనే బంగారు మామిడిపళ్ళ దానం ఆపేసాడు. మంత్రిబుద్ద్ధి రామలింగడి ఇంటి పక్కనే చెరువు ఉంది. ఒకరోజు ఒక మంత్రిగారు అటువైపు వెళుతున్నారు. ఆయన కాలికి బురద అంటింది. కడుక్కోవడానికి చెరువులో దిగాడు. మెట్లమీద కాలుజారి నీళ్ళలో పడి పోయాడు. చెరువులో నీళ్ళు ఎంతో లోతు లేవు. మునిగిపోయే ప్రమాదం లేదు. కానీ మంత్రి లేచే ప్రయత్నం కూడా చెయ్యలేదు. ప్రాణభయంతో వెర్ర్రి కేకలు వేయడం మొదలు పెట్టాడు. ఆ కేకలకి జనం చుట్టూ మూగారు. "చెయ్యి ఇలా ఇవ్వండి లాగుతాం" అని నలుగురైదుగురు చేతులు జాపారు. కానీ మంత్రి వాళ్ళ మాట వినడే! పైగా ఒకటే అరుపులు. ఇంతలో రామలింగడు కూడా అక్కడికి వచ్చాడు. గబగబా ముందుకి పోయాడు. "నా చెయ్యి పుచ్చుకోండి" అన్నాడు. మంత్రి ఆ చెయ్యి అందుకుని బయటికి వచ్చాదు. అక్కడి జనమంతా తెల్లబోయారు. ఇందాకటి నుంచీ అందరూ చెయ్యి ఇవ్వయ్యా అంటే ఇవ్వలేదు. రామలింగడి మాట ఎలా విన్నాడా అనుకున్నారు. జనంలో ఒకకడు రామలింగడినే అడిగాడు. రామలింగడు చిన్న నవ్వు నవ్వాడు. "అబ్బే. మరేం లేదు. మీరంతా చెయ్యి ఇలా ఇవ్వండి అన్నారు. నేను చెయ్యి పుచ్చుకోండి అన్నాను. అదీ తేడా. మంత్రిగారు కదా పుచ్చుకోవడమే గానీ ఇవ్వడం తెలీదు. అంతకంటే ఇంకేం లేదు" అన్నాడు. జనం అందరూ గొల్లున నవ్వారు. అబ్బకు తగ్గ కొడుకు ఒకరోజు రామలింగడి కొడుకు రాజుగారి సభకు వచ్చాడు. వాడు అచ్చు వాళ్ళ నాన్న పోలికే. రాజు వాడిని చూశాడు. ముచ్చటగా ఉన్నాడు అన్నాకున్నాడు. అయితే వాళ్ళ నాన్నకున్న తెలివి తేటలు ఉన్నా యా అనిపించింది. వాడిని దగ్గరుకి పిలిచాడు. వాడు పరుగెత్తుకొని వచ్చాడు. రాజుకి దండం పెట్టాడు. రాజు సంతోషించాడు. పది రూపాయలు ఇవ్వబోయాడు. కానీ కుర్రాడు తీసుకోలేదు. "ఏం. ఎందుకు తీసుకోవు? అనడిగాడు రాజు. "తీసుకోతప్పులేదు" అన్నాడు మళ్ళీ. "వద్దు మా అమ్మ కోప్పడుతుంది" అన్నాడు ఆ కుర్రాడు "ఎందుకు" అనదిగాడు రాజు. "ముక్కూ మొగం ఎరగనోళ్ళ దగ్గర డబ్బు తీసుకోకూడదట. మా అమ్మ చెప్పింది అన్నాడు వాడు. "సెబాస్. ఆవిడ మంచి మాటే చెప్పింది కానీ నేను ముక్కూ మొగం ఎరుగనివాడిని కాదు, రాజుని గదా! తీసుకో" అన్నాడురాజు. "అవును. తెలుసనుకోండి" అని నీళ్ళు నమిలేడు ఆ కుర్రాడు. "మరింకా అనుమానమెందుకు" రాజు నచ్చ చెప్పాడు. "మా అమ్మ నమ్మదు మరి" అన్నాడు వాడు. "ఏం ఎందుకు నమ్మదు?" అడిగాడు రాజు. "ఎందుకంటే నిజంగా ఆ డబ్బులిచ్చింది రాజు గారె అయితె ఆయన పది రూపాయలిస్తారా?బోలెడు ఇస్తారుగానీ అంటుంది మా అమ్మ" అన్నాడు రామలింగడి కొడుకు. దెబ్బతో వాడి తెలివి ఏమిటో రాజుగారికి తెలిసిపోయింది. కానీ ఆ జవాబుకి ఆయన తల తిరిగిపోయింది. వాడికి మంచి కానుకలిచ్చి పంపించాడు.