User Tools

Site Tools


నా_పిల్ల_ఎక్కడ

Differences

This shows you the differences between two versions of the page.

Link to this comparison view

నా_పిల్ల_ఎక్కడ [2018/03/24 11:13]
నా_పిల్ల_ఎక్కడ [2018/03/24 11:13] (current)
Line 1: Line 1:
 +                        నా పిల్లలను ఎవరు రక్షిస్తారు?​
 +అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక పిల్లి తన బిడ్డలతో వుండేది. పిల్లి పిల్ల ఎలుకలను కుందేలును తరుముతూ ఆడుకుంటూ ఉండేది.
 +   ​ఒకరోజు పిల్లి పిల్ల చెట్టు ఎక్కి కూచుంది. కానీ అది దిగలేక పోయింది.
 +   ​అమ్మా!నేను దిగలేను. నాకు భయం వేస్తుంది. అని కేక పెట్టింది. పిల్లను ఎలా దించాలా అని తల్లి ఆలోచించింది. ఎవరైనా సాయం చేస్తారేమోనని పరుగెత్తింది. దారిలో దానికి ఒక తాబేలు కనబడింది.
 +  "​అక్కా,​ అక్కా! నా బిడ్డ చెట్టు ఎక్కి దిగలేక పోతోంది. దానిని కిందకు తీసుకురావా?"​ అని బతిమాలింది.
 +  "​చెల్లెమ్మా! నేను చెట్టు ఎక్కలేను. నీ బిడ్డను కిందికి తీసుకురాలేనమ్మా"​ అని తాబేలు చెప్పింది.
 +  పిల్లి ఇంకా కొంచెం దూరం పోయింది. దానికి ఒక గుర్రం కనబడింది.
 +  "​అన్నయ్యా!అన్నయ్యా! నా బిడ్డ చెట్టు ఎక్కి దిగలేక పోతోంది. దాన్ని కిందకు తీసుకురావా?"​అని బతిమాలింది.
 +  "​చెల్లెమ్మా! నేను చెట్టు ఎక్కలేను. నీ బిడ్డను కిందకు తీసుకురాలేనమ్మా"​ అని గుర్రం చెప్పింది.
 +  పిల్లి ఇంకా కొంచెం దూరం పోయింది. దానికి ఒక ఏనుగు కనబడింది.
 +  "​అక్కా!అక్కా! నా బిడ్డ చెట్టు ఎక్కి దిగలేక పోతున్నది.దాన్ని కిందకు తీసుకురావా?"​ అని బతిమాలింది. ఏనుగు '​సరే పోదాం పదా అంటూ పిల్లి వెంట బయలుదేరింది. చెట్టు దగ్గరికి వెళ్ళింది. తొండంతో పిల్లి పిల్లను పట్టుకుని చెట్టు మీది నుంచి దించింది. పిల్లిపిల్లను రక్షించింది.
  
 +
 +
 +                      మూడు వరాలు
 +  అనగా అనగా ఒక ఊరు.ఆ వూరి పక్కనే ఒక అడవి. ఆ అడవిలో దేవతాస్త్రీలు తిరుగుతుంటారని చెప్పుకొనేవారు. వాళ్ళకు ఎన్నో మహిమలుంటాయని అంటారు. అందుకని ఎవరూ ఆ అడవి లోపలికి వెళ్ళేవాళ్ళు కాదు.
 +     ఆ ఊళ్ళో రాముడనే పేదవాడు ఉండేవాడు. వాడి భార్య సీతాలు. రాముడు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టేవాడు. వాటిని అమ్మి డబ్బులు తెచ్చి భార్యకిచ్చేవాడు. ​
 +   ​ఒకరోజు కట్టెలు కొడుతున్నాడు. ఇంతలో "​నన్ను కాపాడండి"​ అని ఒక స్త్రీ అరుపు వినబడింది. అటు ఇటు చూశాడు. ఒక స్త్రీ కాలుమీద చెట్టు కొమ్మ పడి ఉంది.వెంటనే రాముడు వెళ్ళి కొమ్మ తీసి ఆమెను కాపాడినాడు.
 +    ఆమె దేవతాస్త్రీ. రాముడు చేసిన సహాయానికి సంతోషించింది. "​నేను నీకు,​ నీ భార్యకు మూడు వరాలు ఇస్తున్నాను. బాగా ఆలోచించి ఆ వరాలు కోరుకో"​ అని చెప్పి మాయమై పోయింది. రాముడు గబగబ ఇంటికెళ్ళాడు. ఈ సంగతి సీతాలుకు చెప్పాడు. సీతాలు ఆనందం పట్టలేక పోయింది.
 +   "​ఒక పెద్ద ఇల్లు కోరుకుందామా?​ చాలా డబ్బు కోరుకుందామా?"​ అని సీతాలు ఆపకుండా మాట్లాడసాగింది. రాముడికి కోపం వచ్చింది.
 +   "​నాకు ఆకలిగా వుంది. ముందు నాకు ఇడ్లీలు కావాలి"​ అన్నాడు. ఒక పెద్ద పళ్ళెం నిండా ఇడ్లీలు వచ్చాయి. ఒక వరం వృధా అయిందని సీతాలుకు కోపం వచ్చింది.
 +  నువ్వు తెలివిలేనివాడివి. ఇలాంటి వరమా కోరుకొనేది?​ ఈ ఇడ్లీలు నీ ముక్కుకి కరుచుకోవాలి"​ అనింది.  ​
 +  వెంటనే ఇడ్లీలు రాముడి ముక్కుకు కరచుకున్నాయి. రాముడూ,​ సీతాలు ఎంతలాగినా అవి ఊడి రాలేదు.
 +  "​నీ తెలివి తక్కువ మూలంగా రెండో వరం కూడా పోయింది"​ అని రాముడు సీతాలును అరిచాడు.
 +  ఏమయ్యా ఇంకో వరం ఉందిగదా?​ పెద్ద ఇల్లు,​ కావాలసినంత ధనం కోరుకుందాం"​ అంది సీతాలు.
 +  "​వద్దు సీతాలు. ఈ ఇడ్లీలు ఎప్పుడూ నా ముక్కుకు కరుచుకొనే ఉంటాయి. ఇలా బతకలేను. ఇడ్లీలు నా ముక్కు నుండి మళ్ళీ పళ్ళెంలోకి రావాలి"​. అని రాముడు కోరుకున్నాడు. దీంతో మూడు వరాలు అయిపోయాయి. ఇడ్లీలు మాత్రమే మిగిలాయి.రాముడు,​సీతాలు ఇద్దరూ నవ్వుకుంటూ ఇడ్లీలు తిన్నారు.
 +
 +
 +
 +                            వేటగాడు
 +  అనగా అనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో శీనయ్య. రమణమ్మ అనే భార్యాభర్తలు ఉండేవాళ్ళు. ఒక పూరి గుడిసెలో ఉండేవాళ్ళు. శీనయ్య రోజూ పిట్టలు పట్టి తెచ్చేవాడు. వాటిని అమ్మి డబ్బులు తెచ్చి ఇచ్చేవాడు.
 +   ​ఒకరోజు ఒక అందమైన పిట్ట వలలో చిక్కుకుంది. "​శీనయ్యా,​ శీనయ్యా! నన్ను వదిలిపెట్టు. నేను పిట్టల రాణిని,​ నీకు వరాలిస్తాను"​ అని చెప్పింది పిట్ట.
 +    ఆ పిట్ట మాటలు విని శీనయ్య ఆశ్చర్యపోయాడు. మంచివాడు కనుక ఆ పిట్టను వదిలిపెట్టేశాడు. "​నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను"​ అని చెప్పి పిట్ట వెళ్ళిపోయింది.
 +  శీనయ్య ఇంటికి వెళ్ళి జరిగినదంతా భార్యకు చెప్పాడు.
 + "​నువ్వు ఇప్పుడే వెళ్ళి నాకు ఒక ఇల్లు కావాలి"​ అని ఆ పిట్టను అడగమని తరిమింది.
 +   ​శీనయ్య అడవికి వెళ్ళి "​పిట్టల రాణీ!పిట్టల రాణీ!"​ అని పిలిచాడు. ​
 +   ​పిట్టల రాణి వచ్చింది. ​
 +    "​పిట్టల రాణీ! నా భార్య ఒక ఇల్లు కావాలని పోరు చెస్తున్నది"​ అని చెప్పాడు.
 +     "​అలాగే నువ్వు ఇంటికి పోయి చూడు"​ అని చెప్పి పిట్టల రాణి ఎగిరిపోయింది.
 +     ​శీనయ్య ఇంటికి పోయి చుస్తే,​ గుడిసె ఉన్న చోట ముచ్చటయిన ఇల్లు ఉంది. దాని ముందు అందమయిన తోట కూడా ఉంది. తన భార్య మంచి గుడ్డలు వేసుకొని తోటలో ఉంది.
 +     ​కొంతకాలం సంతోషంగా గడిచింది. రమణమ్మకు రాణిని కావాలని కోరిక పుట్టింది. ఈ సంగతిచెప్పి పిట్టలరాణిని అడిగిరమ్మని శీనయ్యను అడవికి తరిమింది.
 +  శీనయ్య అడవికి వెళ్ళాడు.
 +  "​పిట్టలరాణీ!పిట్టల రాణీ!"​ అని పిలిచాడు.
 +   ​పిట్టలరాణి కనబడింది.
 +   "​పిట్టల రాణీ! నాభార్య ఈ దేశానికి రాణీ కావాలని అడగమంది"​ అని చెప్పాడు.
 +   "​అలాగే నువ్వు ఇంటికి వెళ్ళి చూడు"​ అని చెప్పి పిట్టల రాణి ఎగిరిపోయింది.
 +   ​శీనయ్య ఇంటికి వెళ్ళి చూసాడు. తన భార్య పెద్ద మేడలో ఉంది. ఆమె ముందు మంత్రులు ఉన్నారు.
 +   ​కొన్ని రోజులు సంతోషంగా గడిచాయి.
 +   "​పిట్టల రాణిని కట్టేసి తీసుకురా! మన ఇంట్లో పెట్టుకుంటే మనకు ఏ లోటు ఉండదు"​ అని చెప్పి రమణమ్మ ఒక రోజు భర్తను తరిమింది. ​
 +    శీనయ్య అడవికి వెళ్ళి"​పిట్టలరాణీ!పిట్టల రాణీ!"​ అని పిలిచాడు.
 +    పిట్టలరాణి కనబడింది.
 +     "​నా భార్య నిన్నే కట్టేసి తీసుకురమ్మంది"​ అని చెప్పాడు. ​
 +     "​ఇంత ఆశబోతుతనం పనికిరాదు. ఈ సంగతి నీ భార్యతో చెప్పు"​ అని పిట్టలరాణీ ఎగిరిపోయింది.
 +    శీనయ్య ఇంటికి వెళ్ళాడు. రాజ భవనం ఉన్న చోట తన పాత గుడిసె ఉంది. భార్య దిగులుతో కూచుని వుంది.
 +
 +
 +
 +                           ​ నా పిల్ల ఎక్కడ?​
 +
 +  ఒక ఊరిలో ఒక కోడి తన అయిదుగురు పిల్లలతో కాపురం చేస్తుండేది. అది రోజూ కోడిపిల్లల్ని తీసుకెళ్ళి పురుగులు,​ గింజలు తినిపించేది. ​
 +    ఒక రోజు అది పిల్లలతో పాటు బయటికి వెళ్ళింది. కొంచెంసేపు తరువాత పిల్లలను లెక్క పెట్టింది. ఒకటి,​ రెండు,​ మూడు,​ నాలుగు,​ అయిదవ పిల్ల కనపడలేదు. కోడి వెతుక్కుంటూ వెళ్ళింది.
 +  ఒక మేక కనపడింది.
 +  "​తమ్ముడూ! నా పిల్ల కనబడటం లేదు. నువ్వు దాన్ని చూసావా?"​ అని కోడి అడిగింది.
 +  "​లేదక్కా! నాకు కనబడలేదు"​ అని మేక చెప్పింది.
 +   ​ఇంకా కొంచెం దూరం పోతే ఒక ఎలుక కనబడింది.
 +   "​తమ్ముడూ! నా పిల్ల కనబడటం లేదు. నువ్వు దానిని చూసావా?"​ అని అడిగింది. ​
 +   "​లేదక్కా! నాకు కనబడలేదు"​ అని చెప్పింది. కోడి వెతుక్కుంటూ ఇంకా కొంచెం దూరం పోయింది. ​
 +   ​ఒక కోతి కనబడింది.
 +   "​కోతిబావా! నా పిల్ల కనబడటం లేదు. నువ్వు దాన్ని చూసావా?"​ అని అడిగింది. ​
 +   "​చూసాను! అదిగో అక్కడ చూడు. అది నక్కతో మాట్లాడుతూ ఉంది"​ అని కోతి చెప్పింది. ​
 +     ​కోడి పిల్ల నక్కకు మాటలు చెపుతోంది. కోడి గబుక్కున పిల్లను లాగేసుకొంది. కొంచెం ఆలస్యమైతే ఏమయ్యేది?​
 +                                           
 +
 +    ​సాలెపురుగు-ఈగ
 +   ​నెల్లూరులో వెలగచెట్టు సంగం అనే పేట ఉంది. ఆ పేటలో ఒక పూరిల్లు వుంది. ఆ పూరింట్లో ఒక సాలెపురుగు కాపురం వుందేది. ​
 +   ​ఒక రోజు ఒక ఈగ ఆ ఇంటి దగ్గరికి వచ్చింది."​రామ్మా ఈగా! నీ పేరేమితి?"​ అని సాలె పురుగు అడిగింది. "​నా పేరు స్వరూపరాణి"​ అని ఈగ చెప్పింది.
 +   "​అబ్బా! నీ పేరు నీ అందానికి తగిన పేరు. మా ఇంతికి రామ్మా"​ అని సాలెపురుగు పిలిచింది.
 +    "​అమ్మో! నేను రాను. వస్తే నువ్వు నన్ను తినేస్తావు"​ అని ఈగ అన్నది.
 +    "​నీవంటి అందమైనదాన్ని తింటే కళ్ళు పోతాయి. ఇంట్లోకి వచ్చి చాక్లెట్ తిని పోదువు రామ్మా"​ అని సాలెపురుగు బతిమాలింది. ​
 +    ఈగ సాలెపురుగు మాటలు నమ్మింది. ఇంట్లో అడుగు పెట్టింది. ​
 +    తరువాత జరిగిన కథ ఏమిటి?​ చెప్పండి చూద్దాం.
 +
 +
 +                      ఐదుగురు అన్నదమ్ములు
 +   ​అనగనగా ఒక ఊరిలో ఐదుగురు అన్నదమ్ములు ఉండే వారు. వారి పేర్లు పుల్లయ్య,​ మల్లయ్య,​ ఎల్లయ్య,​ శేషయ్య,​ గురవయ్య.
 +   "​నాయనా మీరు నదికి పోయి చేపలు పట్టుకురండి. కూర వండుతాను",​ అని వారితో ఒకరోజు అమ్మ అంది.
 +   ​వాళ్లు కొంచెం అమాయకులు. అందరూ కలలి నదికి వెళ్ళారు. నది ఒడ్డున దూర దూరంగా కూర్చున్నారు. వల నీళ్ళల్లో వేసారు. ​
 +   "​నాకు ఒక చేప చిక్కింది."​ అని అందరూ అరిచారు.
 +   ​తరువాత పెద్ద అబ్బాయి పుల్లయ్య,​1,​2,​3,​4 అని తమ్ములను లెక్క పెట్టాడు. ఇలా అందరూ 1,2,3,4 అని లెక్క పెట్టి బోరున ఏడవసాగారు.
 +   "​నాయనా ఎందుకు మీరు ఏడుస్తున్నారు"​ అని ఆ దారిన పొయే ఒక రైతు అడిగాడు. ​
 +"​మేము ఐదుగురం అన్నదమ్ములం. ఇప్పుడు నలుగురమే ఉన్నాము. ఒకడు నీళ్ళలో మునిగి పోయాడు. కనిపించడం లేదు"​ అని చెప్పాడు.
 +ఆ రైతు నవ్వాడు.
 +అందరినీ వరుసలో నిలబెట్టాడు.
 +1,2,3,4,5 అని లెక్క పెట్టాడు.
 +అప్పుడు అందరం ఉన్నామని ఆ వెర్రివాళ్ళు సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయారు.
 +
 +
 +
 +                                                   ​  ​ పాయసం
 + ​ఒక కుందేలుకు పాయసం తాగాలని కోరిక పుట్టింది. కానీ ఇంట్లో పాయసం చేయడానికి వస్తువులు లేవు.
 +    ప్రక్క ఇంట్లో ఉన్న ఉడుత దగ్గరికి వెళ్ళింది.
 +   "​వదినా! నేను పాయసం చేసుకుంటున్నాను. కొద్దిగా చక్కెర తక్కువ పడింది. ఒక కప్పు చక్కెర అప్పు ఇవ్వవా?"​ అని అడిగింది.
 +   ​ఉడుత చక్కెర ఇచ్చింది.
 +   ​తర్వాత కుందేలు ఆవు దగ్గరికి వెళ్ళింది.
 +   ​పెద్దమ్మా! నేను పాయసం చేసుకుంటున్నాను. ఒక కప్పు పాలు అప్పుగా ఇస్తావా?"​ అని అడిగింది. ​
 +   "​ఆ చేత్తోనే కొంచెం నెయ్యి కూడా ఇవ్వవా"​ అని అడిగింది. ​
 +   ​ఆవు పాలు,​ నెయ్యి ఇచ్చింది.
 +   ​చక్కెర,​ సేమ్యా,​పాలు,​ నెయ్యి అన్నీ వేసి కుందేలు పాయసం చేసుకుంది. బాగా తిని పడుకుంది. ​
నా_పిల్ల_ఎక్కడ.txt · Last modified: 2018/03/24 11:13 (external edit)